మహారాష్ట్ర… సుప్రీం తీర్పు చారిత్రాత్మకం: సోనియా గాంధీ

మహారాష్ట్ర… సుప్రీం తీర్పు చారిత్రాత్మకం: సోనియా గాంధీ

మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వం బుధవారం సాయంత్రంలోగా బలం నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీంతో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సుఫ్రీం తీర్పును స్వాగతించారు. ఇది చారిత్రాత్మక తీర్పు అని అభివర్ణించారు. బలపరీక్షలో తమ కూటమే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు నేటితో ఎండ్ కార్డ్ పడనుందని శివసేన నేతలు అన్నారు. ఇది ప్రజల విజయం అని చెప్పారు. ఇప్పటికే 162 ఎమ్మెల్యేల మద్ధతు తమకు ఉందని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రకటించాయి.