కవితపై ఈసీకి కాంగ్రెస్​ ఫిర్యాదు

కవితపై ఈసీకి కాంగ్రెస్​ ఫిర్యాదు

హైదరాబాద్​, వెలుగు: బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్​ గురువారం ఫిర్యాదు చేసింది. ఓటు వేశాక ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​కు ఓటు వేయాలంటూ ఓటరు ప్రభావితమయ్యేలా మాట్లాడారని ఆరోపించింది.

కవితపై చర్యలు తీసుకోవాల్సిందిగా  సీఈవో వికాస్​రాజ్​కు  కాంగ్రెస్​ ఎలక్షన్​ కో ఆర్డినేషన్​ కమిటీ చైర్మన్​ జి. నిరంజన్ లేఖ రాశారు. ఈవీఎంలు మొరాయించడంపైనా ఈసీకి నిరంజన్​ ఫిర్యాదు చేశారు. సమస్యలున్న చోట పోలింగ్​సమయాన్ని పెంచాలని కోరారు.