హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ గురువారం ఫిర్యాదు చేసింది. ఓటు వేశాక ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు ఓటు వేయాలంటూ ఓటరు ప్రభావితమయ్యేలా మాట్లాడారని ఆరోపించింది.
కవితపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఈవో వికాస్రాజ్కు కాంగ్రెస్ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జి. నిరంజన్ లేఖ రాశారు. ఈవీఎంలు మొరాయించడంపైనా ఈసీకి నిరంజన్ ఫిర్యాదు చేశారు. సమస్యలున్న చోట పోలింగ్సమయాన్ని పెంచాలని కోరారు.