బల్దియాను ఆదుకోండి..సీఎంను కోరిన కాంగ్రెస్​ కార్పొరేటర్లు

బల్దియాను ఆదుకోండి..సీఎంను కోరిన కాంగ్రెస్​ కార్పొరేటర్లు

హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీకి బడ్జెట్​లో నిధులు కేటాయించి ఆదుకోవాలని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్​కార్పొరేటర్లు కలిసి కోరారు. గత ప్రభుత్వం బల్దియాను అసలు పట్టించుకోకపోవడంతో రూ.వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని వివరించారు. జీహెచ్ఎంసీని ఆదుకొని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్​ హయాంలో ఉన్నవిధంగా పూర్వవైభవం తీసుకురావాలని గుర్తుచేశారు. సీఎంని కలిసిన వారిలో జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్

లింగోజీగూడ కార్పొరేటర్  రాజశేఖర్ రెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ రజితారెడ్డి, రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్, ఈస్ట్ ఆనంద్ బాగ్ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, మచ్చబొల్లారం కార్పొరేటర్ జితేందర్ ఉన్నారు.