- మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం
- మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
మెదక్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సూచించారు. మెదక్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి బుధవారం మెదక్ఎమ్మెల్యే క్యాంప్ఆఫీస్లో దరఖాస్తులు స్వీకరించారు.
పార్టీ పరంగా అన్ని వార్డుల్లో సర్వే నిర్వహిస్తున్నామని, ఆ రిపోర్ట్ ఆధారంగానే గెలుపు అవకాశాలున్న వారికి టికెట్లు ఇస్తామన్నారు. టికెట్ రానివారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఇతర పార్టీల నాయకులతో మ్యాచ్ఫిక్సింగ్ కు పాల్పడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు.
మెజారిటీ కౌన్సిలర్ స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా చైర్మన్ పదవి దక్కించుకొని మాజీ మంత్రి హరీశ్రావును ఇటువైపు రాకుండా చేయాలని సూచించారు. డీసీసీ ప్రసిడెంట్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ హైకమాండ్ సూచనల మేరకు సర్వే ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు చంద్రపాల్, గంగాధర్, బాలకృష్ణ, వెంకటరమణ, పవన్, గూడూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
