తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం కాంగ్రెస్ తోనే సాధ్యం : వనపర్తి ఎమ్మెల్యేలు

తెలంగాణలో  ప్రాజెక్టుల నిర్మాణం కాంగ్రెస్ తోనే సాధ్యం : వనపర్తి ఎమ్మెల్యేలు
  • బీమా ఫేస్–2 సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు

మదనాపురం, వెలుగు: రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించి రైతాంగానికి సాగు నీటిని అందించిన ఘనత కాంగ్రెస్  ప్రభుత్వానికే దక్కుతుందని దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, తూడి మేఘారెడ్డి తెలిపారు. ఆదివారం తిరుమలయ్యపల్లె సమీపంలోని బీమా ఫేస్–2 పంప్​హౌస్  వద్ద పూజలు చేసి సాగు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవరకద్ర, వనపర్తి, కొల్లాపూర్, నియోజకవర్గాల రైతులకు సాగు నీటిని అందించేందుకు బీమా ఫేస్-–2ను అప్పటి కాంగ్రెస్  ప్రభుత్వ హయాంలో నిర్మించామని తెలిపారు.

 రైతులకు సాగునీరు, తాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్  ప్రభుత్వానికే దక్కుతుందని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అందిస్తోందని చెప్పారు. సకాలంలో వర్షాలు కురవడంతో జూన్  నెలలోనే బీమా ఫేస్–2 ఆయకట్టు రైతులకు సాగునీరు వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఏఎంసీ చైర్మన్​ పల్లెపాగ ప్రశాంత్, యూత్  కాంగ్రెస్  జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, చుక్క మహేశ్, శేఖర్ రెడ్డి, శరత్ రెడ్డి, వడ్డే కృష్ణ, వెంకట్ నారాయణ, వేమన్న పాల్గొన్నారు.