హాస్పిటల్లో చేరిన సోనియా గాంధీ

హాస్పిటల్లో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కరోనా మహమ్మారి సోకడంతో ఇంతకాలం ఇంట్లోనే చికిత్స తీసుకున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సోనియాకు ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అబ్జర్వేషన్ లో ఉంచినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. సోనియా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు చెప్పారు.

సోనియా గాంధీకి జూన్ 2న కరోనా సోకింది. అప్పటి నుంచి ఆమె హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా జూన్ 8న ఈడీ ఎదుట హాజరుకావాలని దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. అయితే జూన్ 2న ఆమె కరోనా బారిన పడటంతో విచారణకు హాజరుకాలేకపోయింది. దీంతో శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణకు రావాలని ఆదేశించింది.