కాంగ్రెస్ తోనే ప్రజాస్వామిక తెలంగాణ: అద్దంకి దయాకర్

కాంగ్రెస్ తోనే  ప్రజాస్వామిక తెలంగాణ: అద్దంకి దయాకర్
  • టీపీసీసీ జనరల్ సెక్రెటరీ అద్దంకి దయాకర్
  • మంచిర్యాలలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు 

మంచిర్యాల, వెలుగు: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతోనే ప్రజాస్వామిక తెలంగాణ సాధ్యమవుతుందని కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రెటరీ అద్దంకి దయాకర్ అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని మున్సిపల్ చౌరస్తాలో సీనియర్ కాంగ్రెస్ లీడర్ కె.వి ప్రతాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆయన కుటుంబీకులు రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆశించినప్పటికీ అదేమీ జరగలేదన్నారు.

కేవలం కేసీఆర్ కుటుంబసభ్యులకు మాత్రమే పదవులు వచ్చాయన్నారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో వేలాది ఎకరాలు మునిగినా ఇంతవరకు రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గోమాస శ్రీనివాస్, దుర్గం భాస్కర్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాంగ్రెస్​ ఎస్టీ సెల్​ ప్రెసిడెంట్​ బెల్లయ్య నాయక్, లక్షెట్టిపేట జడ్పీటీసీ ముత్య సత్తయ్య, దాశరపు శ్రీనివాస్, కొమురవెల్లి శ్రీధర్, వొడ్నాల శ్రీనివాస్, దీటి రవి, నల్ల రవి, గడ్డం సతీశ్, దుర్గం ఎల్లయ్య, రాయమల్లు, రాజన్న పాల్గొన్నారు.