సమ్మక్క దర్శనం చేసుకుని వస్తుండగా బల్మూరి అరెస్ట్

సమ్మక్క దర్శనం చేసుకుని వస్తుండగా బల్మూరి అరెస్ట్

కరీంనగర్: ఎన్ఎస్‍యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ ను నిన్న అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రంగనాయకుల గుట్ట దగ్గరున్న సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకుని వస్తుండగా జమ్మికుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అందులో భాగంగా.. బల్మూరి వెంకట్ గాడిదతో జన్మదిన వేడుకలను నిర్వహించారు. అయితే గాడిదను దొంగిలించి.. వేడుకలు చేశారంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఓ టీఆర్ఎస్ నేత ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వెంకట్ తో పాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకొని జమ్మికుంట స్టేషన్ కు తరలించారు.

గాడిదను ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పట్లే..

ఎన్ఎస్‍యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ అరెస్టుకు సంబంధించిన వివరాలను అడిషనల్ డీసీసీ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. బల్మూరిపై గాడిద దొంగతనం కేసు నమోదు చేశామన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బల్మూర్ వెంకట్ దొంగతనంగా గాడిదను తెచ్చి హింసించారని జమ్మికుంట పోలీసులకు ఫిర్యాదు అందిందని చెప్పారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బల్మూరి వెంకట ను అదుపులోకి తీసుకున్నామన్నారు. ‘‘గాడిద ఓ సాధు జంతువు. బడుగు బలహీన వర్గాలకు, సంచార  జాతులకు ఆసరా అయిన గాడిదను దొంగతనం చేసి తేవడమే కాకుండా దాన్ని స్వప్రయోజనాల కోసం.. హింసించి అవమానించినట్లు తేలింది. రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఈ చర్య ఉంది. దీనిపై కేసు విచారణ చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఆ గాడిద ఎక్కడినుంచి తెచ్చాడు? ఓనర్ ఎవరనే వివరాలు కూడా బల్మూరి వెంకట్ చెప్పడంలేదు’’ అని అడిషనల్ డీసీపీ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

ఇక్కడి మట్టే మసాలా!

కొలువుదీరిన తల్లులు.. కోటొక్క మొక్కులు

దూసుకుపోతున్న టాటా మోటార్స్‌!