రైతులకు ఒకేసారి .. 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్కే సాధ్యం

రైతులకు ఒకేసారి .. 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్కే సాధ్యం

రేగోడ్​, వెలుగు: రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయగలిగిన సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని కాంగ్రెస్​ ఎలక్షన్​ కమిటీ చైర్మన్​ దామోదర రాజనర్సింహ చెప్పారు. ఆదివారం మెదక్​ జిల్లా రేగోడ్​లో జరిగిన మీటింగ్​లో పీఏసీఎస్​ వైస్ చైర్మన్ రాధాకిషన్, ఉప సర్పంచ్ రాములు బీఆర్​ఎస్​ను వీడి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్​లో​ చేరారు. 

ఈ సందర్భంగా దామోదర​ రాజనర్సింహ మాట్లాడుతూ.. కాంగ్రెస్​ మేనిఫెస్టో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉందన్నారు. తెలంగాణ  బంగారు భవిష్యత్​ కోసం కాంగ్రెస్​ను  గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.  జర్నలిస్టు విఠల్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే బంగారు తెలంగాణ అవతరిస్తుందన్నారు. 

ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ మున్నూరు కిషన్, పార్టీ మండల అధ్యక్షుడు దిగంబరావు, జడ్పీటీసీ యాదగిరి, ఎంపీపీ సరోజన సాయిలు, పీఏసీఎస్​ డైరెక్టర్ నాగేంద్రరావు కులకర్ణి, మాజీ ఎంపీటీసీ అనిత రామా గౌడ్, మాజీ సర్పంచ్ సునీత నారాయణ, శంకర్, మహేష్,  శ్రీనివాసరెడ్డి  పాల్గొన్నారు.