- లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలే : గజ్జెల కాంతం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పలు శాఖల్లో ఎమ్మెల్సీ కవిత అవినీతికి పాల్పడి వేల కోట్లు సంపాదించి విదేశాల్లో పెట్టుబడి పెట్టారని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం ఆరోపించారు. కేంద్రంలోని సీబీఐకి చిత్తశుద్ధి ఉంటే లిక్కర్ స్కాంపై పూర్తి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీ భవన్ లో గజ్జెల కాంతం మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి రాజకీయాల మీద పూర్తిగా అవగాహన లేదని, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి ఆయనకు లేదని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎవరెన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వాన్ని ఏం చేయలేరని ఆయన హెచ్చరించారు.
బీజేపీకి ఎంపీ అభ్యర్థులు లేక ఇతర పార్టీల నుంచి చేరిన నేతలకు టికెట్లు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లు కచ్చితంగా గెలుస్తుందని, కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.