రేవంత్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి : కొండల్​రెడ్డి

రేవంత్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి : కొండల్​రెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలో రేవంత్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్​ లీడర్​కొండల్​రెడ్డి కోరారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్​ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని హామీ చెప్పారు. సోమవారం కొండల్​రెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఆయా గ్రామాల్లో వివిధ వర్గాల వారిని కలిసి కాంగ్రెస్​ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.  ఈ సందర్భంగా దోమకొండ మండలం అంబారీపేటలో పలువురు కాంగ్రెస్​లో చేరారు. కొండల్​రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్​అధికారంలోకి రాగానే నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. యువత వికాసంలో  భాగంగా ఉన్నత చదువుల కోసం యువత రూ.5 లక్షల సాయం చేస్తామన్నారు.

మహిళల సంక్షేమానికి కాంగ్రెస్​ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతినెలా రూ.2,500 ఇవ్వడంతో పాటు రూ.500 లకే గ్యాస్​సిలిండర్​అందిస్తామన్నారు. పంట పెట్టుబడి సాయంగా రైతులకు ఎకరానికి రూ.15,000, రైతు కూలీలకు రూ.12,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు సైతం అండగా ఉంటామన్నారు. సబ్బండ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్​పనిచేస్తుందన్నారు.