పీఎం మోదీపై ఈసీకి ఫిర్యాదు..

పీఎం మోదీపై ఈసీకి ఫిర్యాదు..

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ ఎన్నికల కోడ్​ ఉల్లంఘించారని కాంగ్రెస్​ నేత జి.నిరంజన్ ఈసీకి కంప్లైంట్ చేశారు. గురువారం బీఆర్కే భవన్​లో సీఈఓ వికాస్​ రాజ్​కు ఆయన ఫిర్యాదు చేశారు. వరంగల్​ జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మోదీ చిన్నపిల్లను తన చేతుల్లోకి ఎత్తుకుని క్యాంపెయినింగ్​ చేసి ఎన్నికల కోడ్​ ఉల్లంఘించారన్నారు. ఈ నెల 6న మామునూరు ఎయిర్​పోర్ట్​ నుంచి.. వరంగల్​లో పబ్లిక్​ మీటింగ్​కు వెళ్తూ.. లక్ష్మీపురంలో ఆగి చిన్న పిల్లను ఎత్తుకున్నారన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఆ వీడియోను వైరల్​ చేశారన్నారు. ఎన్నికల కమిషన్​ రిలీజ్ చేసిన నిబంధనల ప్రకారం ప్రధానిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు.