దేవున్నే మోసం చేసిన ఘనత కేసీఆర్​ది : పొంగులేని శ్రీనివాస్​

దేవున్నే మోసం చేసిన ఘనత కేసీఆర్​ది : పొంగులేని శ్రీనివాస్​
  •     కాంగ్రెస్​ నేత పొంగులేటి 

ఖమ్మం రూరల్​, వెలుగు :  భద్రాచలం రాముడిని సైతం మోసం చేసిన ఘనత  కేసీఆర్ కే దక్కిందని కాంగ్రెస్​ నేత పొంగులేని శ్రీనివాస్​ విమర్శించారు.  ఆదివారం ఖమ్మం రూరల్​ మండలం వెంకటగిరిలో కాంగ్రెస్​ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.  ఈకార్యక్రమంలో  పొంగులేటి మాట్లాడారు.  దేవున్నే మోసం చేసిన ఆయనకు  ప్రజలను మోసం చేయడం పెద్ద పనికాదన్నారు.   ఇచ్చిన హామీలను కేసీఆర్​విస్మరించాడని తెలిపారు.  రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్​ ప్రభుత్వమే అని ,ప్రతి పేదవానికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పారు.  

ప్రజలు, నిరుద్యోగులు, రైతులు కాంగ్రెస్  అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ  సమావేశంలో యుత్​ కాంగ్రెస్​ రాష్ట్ర నాయకులు రాంరెడ్డి చరణ్​రెడ్డి, మాధవిరెడ్డి, బేబీ స్వర్ణకుమారి, రూరల్​ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, హరినాథ్​బాబు, బొర్రా రాజశేఖర్​, కొక్కిరేణి జడ్పీటీసీ శ్రీను,శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.