పేరు గొప్ప ఊరు దిబ్బగా గవర్నమెంట్ హాస్పిటల్స్

పేరు గొప్ప ఊరు దిబ్బగా  గవర్నమెంట్ హాస్పిటల్స్
  •     మాజీ మంత్రి షబ్బీర్​అలీ
  •     హాస్పిటల్​ ఎదుట కాంగ్రెస్​ ఆందోళన

కామారెడ్డి, వెలుగు:  కేసీఆర్​ ప్రభుత్వ హయాంలో  గవర్నమెంట్​ హాస్పిటల్స్​ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బగా ఉందని  కాంగ్రెస్​ నేత షబ్బీర్​అలీ విమర్శించారు.   మంగళవారం దోమకొండ సీహెచ్​సీ ముందు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ   సీహెచ్​సీలో కేవలం ఇద్దరు డాక్టర్లు మాత్రమే డ్యూటీ చేస్తున్నారన్నారు. గర్భిణులు డెలీవరీ కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందన్నారు. 

Also Read:ట్రాక్ట‌ర్ ను ఢీకొన్న బొకారో ఎక్స్ ప్రెస్.. జార్ఖండ్ లో రైలు ప్ర‌మాదం

సీహెచ్​సీని  ఏరియా హాస్పిటల్​గా మార్చటంతో పాటు స్టాఫ్​​ను నియమించాలన్నారు. జూలై ఫస్ట్​ వరకు అప్​గ్రేడ్ చేయకపోతే  నిరహార దీక్ష చేపడుతానన్నారు. అనంతరం  దోమకొండ బస్టాండును ఆయన పరిశీలించారు. ఆయన వెంట డీసీసీ వైస్​ ప్రెసిడెంట్ చంద్రకాంత్​రెడ్డి,  లీడర్లు  స్వామి, భూమాగౌడ్​,  రమేశ్​,  చందు తదితరులు పాల్గొన్నారు.