ఎన్నికల వేళ రాజకీయ నాయకుల మాటలు హద్దులు దాటుతుంటాయి. నోటికొచ్చినట్లు మాట్లాడతారు. ఒక్కోసారి అది చేయి చేసుకునే వరకు వెళుతుంది. టీవీల్లో జరిగే డిబేట్లలో అయితే అరుపులు..కేకలతో వారు చెప్పిందే రైటంటూ రచ్చ రచ్చ చేస్తారు. లైవ్ అన్నది మర్చిపోయి కూడా ఒకరినొకరు దాడికి దిగిన ఘటనలు మనం చూశాం.
లేటెస్ట్ గా ఓ నేషనల్ ఛానల్ లైవ్ డిబేట్ లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆలోక్ శర్మ, బీజేపీ అధికార ప్రతినిధి కేకే.శర్మ పాల్గొన్నారు. ఈ చర్చలో కాంగ్రెస్ నాయకులు దేశద్రోహులు అని కేకే. శర్మ పలు సార్లు అన్నారు.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆలోక్ శర్మ బీజేపీ నేతలు సారీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీనికి కేకే.శర్మ నో చెప్పడంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నేత అలోక్ శర్మ పక్కనే ఉన్న నీళ్ల గ్లాసును ఆయనపై విసిరారు. మిస్సయిపోయి గ్లాసులోని నీళ్లు కాస్త యాంకర్పై పడ్డాయి. దీంతో ఆయన డిబేట్ ను మధ్యలోనే ఆపేసి డ్రెస్ ఛేంజ్ చేసుకున్నారు. తర్వాత చర్చను కంటిన్యూ చేసినా వారి రచ్చ ఆగలేదు. ఈ డిబేట్ పై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలు ఇలా అందరి ముందు కొట్టుకోవడమేంటని కామెంట్లు పెడుతున్నారు.