
రాష్ట్రంలో రాహుల్ టూర్ నేపధ్యంలో OUలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముందస్తు అరెస్టులకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా NSUI ఆందోళనకు పిలుపునిచ్చింది. OUలో రాహుల్ ముఖాముఖికి అనుమతి ఇవ్వాలంటూ నిరసనలు తెలుపుతున్నారు. దీంతో OUలో NSUI నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని OU పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు OUలో భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళనలకు అనుమతి లేదంటున్నారు. అటు OUలో అరెస్ట్ లపై మండిపడుతున్నారు విద్యార్థి నేతలు. అరెస్టులపై హైకోర్టును ఆశ్రహిస్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలతో గాంధీ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు సీఎల్పీ కాసేపట్లో అత్యవసర భేటీ కానుంది. భేటీ తర్వాత చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు పీసీసీ నేతలు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ లతో పాటు... పలువు నేతలు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. జైలులో ఉన్న విద్యార్థి నేతలను పరామర్శించనున్నారు.