మంత్రి హరీశ్​కు కాంగ్రెస్ ​నేతల వెల్​కమ్

మంత్రి హరీశ్​కు కాంగ్రెస్ ​నేతల వెల్​కమ్

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వస్తున్న మంత్రి హరీశ్ రావుకు స్వాగతం పలుకుతూ కాంగ్రెస్​ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ డం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం హరీశ్​రావు, మంత్రి సబితా రెడ్డి రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్​లో పర్యటించి.. పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ పీసీసీ సభ్యుడు, మున్సిపాల్టీ 18వ వార్డు కౌన్సిలర్ కాకుమాను సునీల్, 10వ డివిజన్​కు చెందిన మేతరి అనురాధ దర్శన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో మంత్రుల ఫొటోలతోపాటు కాంగ్రెస్​నేతలు మల్​రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి ఫొటోలు కూడా పెట్టడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇరు పార్టీల మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతుంటే.. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిన తీరు హాట్ టాపిక్​​గా మారింది.