రాష్ట్రంలోని విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని టీపీసీసీ మేనిఫేస్టో కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన ఇవాళ మేనిఫేస్టో కమిటీ భేటీ అయ్యింది. అక్టోబర్ 2 నుంచి జిల్లాలో మేనిఫేస్టో కమిటీ పర్యటించనుంది.
అక్టోబర్ 2న ఆదిలాబాద్, నిజామాబాద్, జిల్లాల్లో కమిటీ పర్యటించనున్నట్టు శ్రీధర్బాబు తెలిపారు.. ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మరికొన్ని వర్గాలకు ఉపయోగపడేలా త్వరలో మరిన్న పథకాలు రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకుంది.