షాద్ నగర్,వెలుగు: ఇందిరమ్మ రాజ్యంతోనే తెలంగాణ వాసుల కలలు సాకారం అవుతాయని షాద్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ తెలిపారు. మంగళవారం షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 23,24 వార్డుల్లో ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అరాచకాలకు, దౌర్జన్యాలకు అడ్డాగా మారిందన్నారు. ప్రశ్నించే వాళ్లను కేసుల పేరుతో బీఆర్ఎస్ సర్కారు ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. అనంతరం బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు వీర్లపల్లి శంకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. శంకర్ వెంట పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత దంగు శ్రీనివాస్ యాదవ్, ఖదీర్, నల్లమోని శ్రీధర్, సుదర్శన్, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు.
ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తం: వీర్లపల్లి శంకర్
- రంగారెడ్డి
- November 15, 2023
లేటెస్ట్
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- టీఎస్ఐసెట్కు రికార్డ్ స్థాయి అప్లికేషన్లు
- 1984లో పారిపోయిన ఖైదీ..40 ఏండ్ల తర్వాత దొరికిండు
- మార్చురీ కంపును భరించలేక పోతున్నం
- వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లాభం రూ. 6 కోట్లు
- ప్లాంటు నిర్మించిన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్
- మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
- ఇండియాలో ఏసర్ప్యూర్ ప్రొడక్ట్లు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్