సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలె: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలె: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాష్ట్రాల అభివృద్ధికి ముఖ్య కారణం గ్రామాల అభివృద్ధి.. గ్రామ సర్పంచ్ లు పోషిస్తున్న పాత్రకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మే 7వ తేదీ ఆదివారం ఆయన జగిత్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా సర్పంచులు పని చేస్తున్నా.. గ్రాంట్స్ విడుదల కాకపోవడంతో బలవన్మణానికి పాల్పడుతున్నారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో సర్పంచ్ కి రూ.20 నుండి 40 లక్షలు పెండింగ్ లో ఉన్నాయన్నారాయన. ఆరు మాసాలకుపైగా బిల్లులు పెండింగ్లో ఉంటే గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లులు ఎట్లా చెల్లిస్తారని నిలదీశారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రభుత్వ శాఖలలో కరెంటు బిల్లులు పెండింగ్ ఉంటే ఏమంటలేరు కానీ గ్రామపంచాయితీలో పెండింగ్ ఉంద్దొదు అంటున్నారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

మండల పరిధిలోని ఖర్చులను గ్రామ పంచాయితీలపై వేస్తున్నారు. దీం ఆందోళన చెందుతున్న రాయికల్, సారంగాపూర్ మండలంలోని సర్పంచ్ లు దాదాపు అందరు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. బలహీన వర్గాలకు కేటాయించిన స్థానాన్ని రెండు సంవత్సరాల వరకు భర్తీ చేయకపోవడం దారుణమన్నారు. ఇక్కడ ఉన్న రిజ్వేషన్లను భర్తీ చేయడం చేతకాదు కానీ మహిళ సాధికారత పేరుతో చట్ట సభల్లో రిజ్వేషన్లపై కోట్లాడుతార అంటూ ఎద్దేవ చేశారు. పంచాయితీ శాఖ మంత్రి దయాకర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సర్పంచులను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.

బిల్స్ రావడం లేదని సర్పంచులు పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలపడానికి వస్తే ఓదార్పు తెలపడం పోయి పోస్తే పోసుకపో అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సర్పంచులు మీకు జాతీయ అవార్డు తెచ్చి పెట్టాలి.. కానీ కనీసం వారికి ఓదార్పు ఇవ్వలేక పోతున్నారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన జీవన్ రెడ్డి..అధికారులు సర్పంచులను భయభ్రాంతులకు గురిచేస్తూ పనులను చేయించుకుంటున్నారు కానీ బిల్స్ మాత్రం ఇస్తలేరని పేర్కొన్నారు.