టీఆర్ఎస్ కార్యకర్తలను గ్రామాల్లో తిరగనియ్యం

టీఆర్ఎస్ కార్యకర్తలను గ్రామాల్లో తిరగనియ్యం

రైతుకు మద్దతు ధర ప్రకటించటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కనీస మద్దతు ధర లభిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే టీఆర్ఎస్ కార్యకర్తలను గ్రామాల్లో తిరగనియ్యమన్నారు. ధాన్యం కొనుగోలుకు దుకాణం తెరవకుంటే‌‌.. టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందన్నారు. కొత్త  వ్యవసాయ చట్టాలు రైతుల అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రైతుకు మద్దతు ధర కల్పించిందన్నారు. మంత్రులను రోడ్లపై కూర్చో పెట్టిన కేసీఆర్ వ్యవసాయ చట్టంపై యూ టర్న్ తీసుకున్నాడన్నారు. ఢిల్లీలో కేసీఆర్ మోదీ కాళ్ళు పట్టుకున్నాడన్నారు.  తెలంగాణ కేసీఆర్ జగీర్ కాదన్నా జీవన్ రెడ్డి.. రైతు బంధు ఒట్టి మోసమన్నారు. శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులను కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉపాధిహామీ పథకంతోనే అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఎక్కడ పుడితే ఏంటని.. పేదల బాధలు తెలిసిన మనిషి సోనియా గాంధీ అని అన్నారు.

హైదరాబాద్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్