కార్పెంటర్‌‌గా మారిన రాహుల్‌ గాంధీ

కార్పెంటర్‌‌గా మారిన రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ గురువారం ఢిల్లీలోని కీర్తి నగర్‌‌ ఫర్నీచర్‌‌ మార్కెట్‌ను సందర్శించారు. తర్వాత అక్కడి కార్పెంటర్లతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫర్నీచర్‌‌ షాపులో కొద్దిసేపు కార్పెంటర్‌‌ వర్క్‌ చేశారు. ‘‘ఈ రోజు నేను ఢిల్లీలోని కీర్తి నగర్‌‌లో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద ఫర్నీచర్‌‌ మార్కెట్‌కి వెళ్లి, కార్పెంటర్ సోదరులను కలిశాను”అని రాహుల్‌ ట్వీట్ చేశారు. వారితో చాలా మాట్లాడానని, వారి నైపుణ్యాల గురించి  తెలుసుకున్నానని చెప్పారు. అలాగే, వారి ద్వారా తాను కొంత నేర్చుకోవడానికి ప్రయత్నించానని పేర్కొన్నారు.