కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ కన్నుమూత

కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ కన్నుమూత

ముంబై: కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ (48) కరోనా బారిన పడి మృతి చెందారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజీవ్.. కరోనా నుంచి కోలుకున్న అనంతరం చనిపోయారని సమాచారం. వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్ పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సాతవ్ మృతిపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు  అన్నారు. సాతవ్ కుటుంబ సభ్యులకు బలం చేకూరాలని కోరారు.