
పద్మారావునగర్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ పదేళ్ల విధ్వంస పాలన, రెండేళ్ల వికాస పాలనకు మధ్య ఎన్నిక జరుగుతోందన్నారు. నవీన్ యాదవ్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.