
- సరైన వ్యాక్సిన్తోనే నివారణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘కాంకర్ హెచ్పీవీ అండ్ క్యాన్సర్ కాన్క్లేవ్ 2025’ ను బేగంపేటలోని ఓ హోటల్లో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో డాక్టర్ త్రిపుర సుందరి మాట్లాడారు. హెచ్పీవీ క్యాన్సర్ల నివారణకు క్యాంపెన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఇండియాలో మహిళల్లో ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ ఉంటోందని, ఏటా 1.23 లక్షల కొత్త కేసులు, 77 వేల మరణాలు నమోదవుతున్నాయని చెప్పారు. సరైన వ్యాక్సిన్తోనే నివారణ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ లీల, లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సుధ, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నివలిక రాజమోని, డాక్టర్ సురేంద్రనాథ్, డాక్టర్ పవన్ కుమార్ పాల్గొన్నారు.