హైదరాబాద్లో గంజాయి తనిఖీలకు వెళ్లి.. నిల్చున్న చోటే కుప్పకూలిన కానిస్టేబుల్

హైదరాబాద్లో గంజాయి తనిఖీలకు వెళ్లి.. నిల్చున్న చోటే కుప్పకూలిన కానిస్టేబుల్

ఇటీవలి కాలంలో ఎక్కువ మందిని బలితీసుకుంటున్న సమస్య గుండెపోటు. అరోగ్యంగా ఉన్న యువకులు కూడా హార్ట్ అటాక్ తో చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆదివారం (జూన్ 22) హైదరాబాద్ బాలానగర్ లో తనిఖీలకు వెళ్లిన కానిస్టేబుల్  గుండెపోటుతో  మృతి చెందాడు.

వివరాల్లోకి వెళ్తే.. బాలానగర్ ఏరియాలో ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నట్లుగా ఫిర్యాదు రావటంతో తనిఖీల వెళ్లారు బాలనగర్ జోన్ పోలీసులు. తనిఖీలు నిర్వహిస్తుండగా  ఎస్ వోటీ   కానిస్టేబుల్ ప్రవీణ్ (39) ఒక్కసారిగా గుండె పోటు రావటంతో నిల్చున్న దగ్గరే కుప్పకూలిపోయాడు. 

గుండెను పట్టుకుని అలాగే కూర్చునిపోయిన కానిస్టేబుల్ పరిస్థితిని గమనించిన సిబ్బంది.. పీసీఆర్ చేశారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.