టిప్పర్‎ను ఢీకొట్టిన కారు.. కానిస్టేబుల్ మృతి

టిప్పర్‎ను ఢీకొట్టిన కారు.. కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి టిప్పర్‎ను వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. కేపీహెచ్‎బీ ఫోరం మాల్ వద్ద వంతెనపై అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. శంషాబాద్ పోలీసు స్టేషన్‎లో హెడ్ కానిస్టేబుల్‎గా‌ విధులు నిర్వహిస్తున్న ఈశ్వరయ్య (45)... మంగళవారం వ్యక్తిగత పనుల మీద కారులో బయలుదేరాడు. ఫోరం మాల్ వద్దకు రాగానే స్పీడ్‎ను కంట్రోల్ చేయలేక ముందువెళ్తున్న టిప్పర్‎ను ఢీకొట్టాడు. దాంతో ఈశ్వరయ్యకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

కారును ఢీకొట్టి లోయలో పడిన ఆర్టీసీ బస్సు

దళితులకు మూడెకరాలు ఇస్తామని మేమెక్కడా చెప్పలేదు