సెల్​ఫోన్​ దొంగలకు కానిస్టేబుల్స్​ సహకారం

సెల్​ఫోన్​ దొంగలకు కానిస్టేబుల్స్​ సహకారం
  •  అదుపులోకి తీసుకున్న పోలీసులు 

పంజాగుట్ట, వెలుగు: దేశంలోని వేర్వురు ప్రాంతాల్లో సెలఫోన్లు చోరీ చేసి, విదేశాలకు తరలిస్తున్న జార్ఖండ్, బిహార్, వెస్ట్​బెంగాల్ కు చెందిన అల్మిన్​గజి, మహ్మద్​షాన్​వాజ్, గోవింద్​కుమార్​మాతో, జుగేశ్వర్ నోనియా, జోనుకుమార్, ఎండీ ముక్తర్, ఓ మైనర్ ను పంజాట్ట పోలీసులు అరెస్టు చేశారు. 15 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ ​జోన్ డీసీపీ విజయ్​కుయార్ మంగళవారం పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో వివరాలు వెల్లడించారు. 

నిందితులు చోరీ చేసిన సెలఫోన్లను బంగ్లాదేశ్​సరిహద్దుల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. సెల్​ఫోన్​ దొంగలకు ముగ్గురు పోలీసులు సహకరించినట్లు గుర్తించామన్నారు. గాంధీనగర్ పీఎస్​లో పనిచేసే కానిస్టేబుల్​పి.సోమన్న, హోంగార్డు అశోక్, సైఫాబాద్​ పీఎస్​లో పనిచేస్తున్న కానిస్టేబుల్​సాయిరాం సెల్​ఫోన్​దొంగలకు సహకరించారని వెల్లడించారు. వారిని కూడా అరెస్ట్​ చేశామన్నారు. 

ఈ సందర్భంగా ఫోన్​ ట్యాపింగ్​కేసు దర్యాప్తును డీసీపీ వివరించారు. రాజకీయ నేతలను విచారిస్తున్నామని, సాక్ష్యాలు  సేకరిస్తున్నామ తెలిపారు. ఇద్దరు కీలక నిందితులు విదేశాల్లో ఉన్నారని, వారిని 
ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.