తెలంగాణలో యువత జీవితాలు మారలేదు : రాజారమేశ్

తెలంగాణలో యువత జీవితాలు మారలేదు : రాజారమేశ్

కోల్​బెల్ట్​,వెలుగు : బీఆర్​ఎస్​ పాలనలో యువత  జీవితాలు మారలేదని నియోజకవర్గ  కాంగ్రెస్​ లీడర్​ డాక్టర్​ రాజారమేశ్​ అన్నారు. శుక్రవారం సాయంత్రం క్యాతనపల్లి మున్సిపాలిటీ భీమాగార్డెన్స్​ ఏరియాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మందమర్రి, రామకృష్ణాపూర్​కు చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  తెలంగాణ వస్తే విద్యార్థులు, యువకుల జీవితాలు మారుతాయని అనుకున్న అందరికి కన్నీరే మిగిందన్నారు. యువత చైతన్యవంతులై ప్రజావ్యతిరేక బీఆర్​ఎస్​ పాలనపై ఉద్యమించాల్సిన తరుణం వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపిస్తే అన్ని వర్గాల అభివృద్ది సాధ్యమవుతుందని చెప్పారు.