బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తరు

బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తరు

యాదాద్రి, వెలుగు : బీజేపీని మళ్లీ గెలిపిస్తే ఈసారి రాజ్యాంగమే మారుస్తారని సీపీఎం పొలిట్​బ్యూరో మెంబర్​ బీవీ రాఘవులు, సీపీఎం స్టేట్​సెక్రెటరీ తమ్మినేని వీరభద్రం అన్నారు. భువనగిరి లోక్​సభ అభ్యర్థి ఎండీ జహంగీర్​నామినేషన్​వేసిన సందర్బంగా నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. రాఘవులు మాట్లాడుతూ మోదీ పాలనలో మతోన్మాదం పెరిగిపోయిందన్నారు. లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్నారు.పదేండ్ల తర్వాత రాష్ట్రంలో పవర్​లోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రజలను, ప్రతిపక్షాలను పట్టించుకోవడం లేదన్నారు. 

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఒంటెద్దు పోకడలకు పోతున్నారన్నారు. ఇప్పటికైనా అందరికీ కలుపుకొని పోవాలన్నారు. నామినేషన్​కు ముందుగా భువనగిరిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్​, జూలకంటి రంగారెడ్డి, ఎస్ వీరయ్య, చుక్కారాములు, జ్యోతి, జాన్ వెస్లీ, పాలడుగు భాస్కర్, డీజీ నర్సింగ్ రావు, మల్లు లక్ష్మి,  పోతినేని సుదర్శన్, తీగల సాగర్, కొండమడుగు నరసింహా, ఐలయ్య, ఆశయ్య పాల్గొన్నారు.