యాదాద్రి, వెలుగు : బీజేపీని మళ్లీ గెలిపిస్తే ఈసారి రాజ్యాంగమే మారుస్తారని సీపీఎం పొలిట్బ్యూరో మెంబర్ బీవీ రాఘవులు, సీపీఎం స్టేట్సెక్రెటరీ తమ్మినేని వీరభద్రం అన్నారు. భువనగిరి లోక్సభ అభ్యర్థి ఎండీ జహంగీర్నామినేషన్వేసిన సందర్బంగా నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. రాఘవులు మాట్లాడుతూ మోదీ పాలనలో మతోన్మాదం పెరిగిపోయిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్నారు.పదేండ్ల తర్వాత రాష్ట్రంలో పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను, ప్రతిపక్షాలను పట్టించుకోవడం లేదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒంటెద్దు పోకడలకు పోతున్నారన్నారు. ఇప్పటికైనా అందరికీ కలుపుకొని పోవాలన్నారు. నామినేషన్కు ముందుగా భువనగిరిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్, జూలకంటి రంగారెడ్డి, ఎస్ వీరయ్య, చుక్కారాములు, జ్యోతి, జాన్ వెస్లీ, పాలడుగు భాస్కర్, డీజీ నర్సింగ్ రావు, మల్లు లక్ష్మి, పోతినేని సుదర్శన్, తీగల సాగర్, కొండమడుగు నరసింహా, ఐలయ్య, ఆశయ్య పాల్గొన్నారు.