TS జెన్ కో, ట్రాన్స్ కోకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు

TS జెన్ కో, ట్రాన్స్ కోకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు

విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్ కో), విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్ కో)లకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది. జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీఎసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, కార్పొరేట్ ఆఫీస్ అధికారి గోపాలరావులకు నోటీసులను ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోవడం లేదంటూ 84 మంది విద్యుత్ ఉద్యోగులు వేసిన పిటిషన్ ను ఈ రోజు (మంగళవారం) సుప్రీంకోర్టు విచారించింది.

ధర్మాధికారి నివేదిక ప్రకారం 1,150 మంది విద్యుత్ ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయించారు. అందులో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 655 మందిని విధుల్లోకి తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నా.. 84 మందిని మినహాయించి విధుల్లోకి తీసుకుంది. దీంతో ఆ ఉద్యోగులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. అధికారులకు నోటీసులిచ్చి విచారణను జులై 16కి వాయిదా వేసింది.