కంటోన్మెంట్ అభివృద్ధి పనులపై సమీక్ష ... ప్రజలు వినతులు సమర్పించాలని ఎమ్మెల్యే సూచన

కంటోన్మెంట్ అభివృద్ధి పనులపై సమీక్ష ...    ప్రజలు వినతులు సమర్పించాలని ఎమ్మెల్యే సూచన

పద్మారావునగర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి కృషి, పట్టుదలతోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ.303 కోట్లు వచ్చినట్లు ఎమ్మెల్యే శ్రీగణేశ్ తెలిపారు. కంటోన్మెంట్​పరిధిలో రూ.303 కోట్లతో చేపట్టనున్న నాలాలు, డ్రైనేజీ నిర్మాణ పనులపై బుధవారం కంటోన్మెంట్‌‌‌‌ బోర్డు కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ప్రజాప్రతినిధులు, హెచ్‌‌‌‌ఎం‌‌‌‌డీఎ, హెచ్‌‌‌‌ఎం‌‌‌‌డబ్ల్యూఎస్‌‌‌‌ అధికారులతో పాటు ఎమ్మెల్యే శ్రీగణేశ్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎలివేటెడ్‌‌‌‌ కారిడార్ల నిర్మాణం ద్వారా కంటోన్మెంట్‌‌‌‌ బోర్డుకు రూ.303 కోట్లు లభించాయన్నారు. గతంలో ఈ ప్రాంతానికి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్నందున ఇక్కడి సమస్యలను సీఎం రేవంత్​రెడ్డి బాగా అర్థం చేసుకుంటున్నారన్నారు. 

టెండర్లు ఖరారయ్యేలోపు ప్రజల సూచనలు, సలహాలు స్వీకరించి ఏ ఏ ప్రాంతాల్లో డ్రైనేజీ, నాలాలు అభివృద్ధి చేయాలో నిర్ణయించి అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 30 రోజులలో టెండర్లు ఖరారు కానున్నాయని, ఈ సమయంలో ప్రజలు తమ వినతులు, సూచనలు కంటోన్మెంట్‌‌‌‌బోర్డుకు అందజేయాలని ఎమ్మెల్యే సూచించారు. డ్రైనేజీలు, రోడ్లకు నిధులను ఒకేసారి విడుదల చేసి పనులు వేగంగా పూర్తి చేస్తే ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు.