పీయూలో వంటా వార్పు

పీయూలో వంటా వార్పు

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీల్లో పని చేస్తున్న 1,335 మంది కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ తో పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన తెలిపారు. బుధవారం యూనివర్సిటీ ఆవరణలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీయూటీఏ అధ్యక్షుడు వంగరి భూమయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

కాంట్రాక్ట్  అధ్యాపకులను రెగ్యులరైజ్  చేసేంత వరకు నిరసన కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్, అర్జున్ కుమార్, విజయ్ భాస్కర్, శ్రీధర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రవికాంత్, సుదర్శన్ రెడ్డి, బషీర్, సురేశ్, స్వాతి, మాధురి, బృందా పాల్గొన్నారు.