కరీంనగర్ లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

కరీంనగర్ లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

తెలంగాణ‌లో మ‌రో 2 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇండోనేషియా నుంచి క‌రీంన‌గ‌ర్ వ‌చ్చిన వారితో తిరిగిన వ్య‌క్తికి గ‌తంలో క‌రోనా పాజిటివ్ రాగా.. తాజాగా అత‌డి ఫ్యామిలీలోని ఇద్ద‌రికీ క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ శ‌శాంక్ తెలిపారు.

కరోనా సోకినవారిలో ఇద్దరు మహిళలేనని చెప్పారు. ఆ ఇద్దరితోపాటు, వారి ముగ్గురు పిల్లలను కూడా హైదరాబాద్‌ గాంధీ హాస్పిట‌ల్ కి తరలించామన్నారు. మొత్తం 8 మంది కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి నెగిటివ్‌ వచ్చిందని తెలిపారు. రెడ్‌ జోన్‌ పరిధిలో గృహ నిర్బంధం కొనసాగుతుందన్నారు. దీంతో వీరి ముగ్గురిని క‌లిసిన వారి కోసం ఆరా తీస్తు..  క‌రీంన‌గ‌ర్ లో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.