విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కరోనా అలర్ట్

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కరోనా అలర్ట్

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న వైరస్ కరోనా. ఆ వైరస్ ఇండియాలో వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విశాఖపట్నం విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే ప్రయాణికులు, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారిని పరిశీలించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు.

కరోనా వైరస్ ఇప్పటికే సోకిన దేశాల నుంచి వచ్చే వారికి ఇక్కడ ప్రత్యేక పరీక్షలు ఉంటాయని అధికారులు చెప్పారు. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల దగ్గర ప్రయాణికుల అవగాహన కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. చైనా, దుబాయ్, మలేషియా, సింగపూర్ నుంచి నగరానికి వస్తున్న వారిని పూర్తిగా పరిశీలిస్తున్నామని… వారిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేకుంటేనే నగరంలోకి పంపుతునట్లు స్పష్టం చేశారు అధికారులు.