దేశంలో 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వరుసగా తొమ్మిదో రోజు దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 3 లక్షల 86 వేల 452 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకూ రోజువారీ కేసుల పరంగా ఇదే అత్యధికం కాగా..మొత్తం బాధితుల సంఖ్య కోటి 87 లక్షలు దాటింది. మరణాలు కూడా వరుసగా మూడో రోజు 3 వేలకు పైగా నమోదయ్యాయి. నిన్న దేశవ్యాప్తంగా 3 వేల 498 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2 లక్షల 8 వేలు దాటింది. ప్రస్తుతం దేశంలో 31 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.