96 లక్షలు దాటిన కరోనా కేసులు

96 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 40 వేలకు దిగువ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 36 వేల652 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 96 లక్షల 8 వేల 211 కి చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 512మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 39 వేల 700కు చేరింది. నిన్న మరో 42 వేల 533 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకూ 90 లక్షల 58 వేల 822  మంది కరోనా నుంచి కోలుకున్నారు.  4 లక్షల 22వేల 943యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా11లక్షల57,వేల 763 టెస్టులు చేశారు.