కరోనా కేసులు పెరుగుతున్నయ్..

కరోనా కేసులు పెరుగుతున్నయ్..

న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండో రోజు కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 41 వేల 806 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 కోట్ల 9 లక్షల 87 వేల 880కి పెరిగింది. ఇక నిన్న కరోనా కారణంగా 581 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4 లక్షల 11 వేలు దాటింది. ఇక ఇప్పటివరకూ 3 కోట్ల ఒక లక్షల 43 వేల 850 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4 లక్షల 32 వేల 41 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఇప్పటి వరకూ 39 కోట్ల 13 లక్షల 40 వేల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న ఒక్క రోజే 34 లక్షల 97 వేల 58 డోసులు పంపిణీ చేశామని స్పష్టం చేసింది.