భారత్ లో 6కు చేరిన కరోనా మరణాలు

భారత్ లో 6కు చేరిన కరోనా మరణాలు

కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తుంది. మృతుల సంఖ్య పెరుగుతుంది. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో  63 ఏళ్ల వృద్ధుడు చనిపోగా..  పాట్నాలో 38 ఏళ్ల వ్యక్తి  చికిత్స తీసుకుంటుండగా చనిపోయాడు. కిడ్నీ సంబంధ వ్యాధితో  ఎయిమ్స్  ఆస్పత్రిలో చేరిన అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది.  చికిత్స తీసుకుంటుండగా 21న రాత్రి చనిపోయాడు. బీహార్ లో ఇది తొలి కరోనా మరణం.

వీరి మరణంతో దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరింది.  మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య 2కు పెరిగింది. గత 24 గంటల్లో 10 కేసులు నమోదవ్వగా  మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 74కు చేరింది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 341కు చేరింది.