తెలంగాణలో వెయ్యి దాటిన కరోనా మరణాలు

తెలంగాణలో వెయ్యి దాటిన కరోనా మరణాలు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,159 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,65,003 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం కరోనా బారినపడి 9 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1005కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,260 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,33,555గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,443 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 23,674 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. బుధవారం రాష్ట్రంలో 53,094 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 23,29,316 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 318, రంగారెడ్డి 176, నల్గొండ 141, సిద్ధిపేట్ 132, కరీంనగర్ 127, మేడ్చల్ 121, వరంగల్ అర్బన్ 98, నిజామాబాద్ 84, మహబూబా బాద్ 84, ఖమ్మం 77, కామారెడ్డి 68, సూర్యపేట్ 66, సంగారెడ్డి 64, భద్రాద్రి 60, సిరిసిల్ల 53 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

షుగర్ బాధితులు, లావుగా ఉన్నోళ్లకే ఎక్కువ ప్రమాదం

అభిమానుల చూపంతా ధోని ఐపీఎల్ ఆటపైనే..

ఉద్యోగం పోయినోళ్లకు నయా జాబ్స్..