ఐఐటీ మద్రాసులో మరో 79 మందికి కరోనా

ఐఐటీ మద్రాసులో మరో 79 మందికి కరోనా

చెన్నై: మద్రాసు ఐఐటీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో 79 మంది స్టూ డెంట్లు ఈ వైరస్ బారినపడటంతో మొత్తం కేసుల సంఖ్య 183కి చేరిం ది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 978 శాంపిల్స్ సే కరించగా, 183 మందికి పాజిటివ్ వచ్చింది. మరో 25 శాంపి ల్స్​రిజల్ట్​రావాల్సి ఉందని తమిళనాడు హెల్త్​ సెక్రటరీ జె.రాధాకృష్ణన్ చెప్పారు. ఇక్కడి ఉద్యోగులకు, కార్మికులకు కూడా టెస్టులు చేశామని చెప్పారు. ఇది వరకు పాజిటివిటీ రేటు 20 శాతం ఉండగా, ఇప్పుడిది 15 శాతానికి పడిపోయిందని ఆయన వివరించారు.