గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. కొంత మంది విద్యార్థినిలు జలుబు సోకి ఇబ్బందిపడుతుండడం గమనించిన ప్రిన్సిపాల్ వైద్య బృందాన్ని పిలిపించి మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మందికి కరోనా పరీక్షలు చేయించారు. కరోనా పరీక్షల్లో 29 మందికి పాజిటివ్ వచ్చింది.

కరోనా సోకిన విద్యార్థినుల్లో 25 మంది ఇంటర్ సెకండియర్ విద్యార్థినిలు కాగా, మరో నలుగురు స్కూల్ విద్యార్థినిలు ఉన్నారు. తమ పిల్లలకు కరోనా సోకిందని తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్ కు వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. గురుకుల పాఠశాల ప్రాంగణం మొత్తాన్ని శానిటైజ్ చేయించామని, కాలేజీలో ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.