కరోనాకు ప్లాస్మా ట్రీట్​మెంట్​ సేఫ్

కరోనాకు ప్లాస్మా ట్రీట్​మెంట్​ సేఫ్

వాషింగ్టన్:  ప్లాస్మా ట్రీట్​మెంట్​పై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, ఈ ట్రీట్​మెంట్​ పూర్తిగా సురక్షితమని లేటెస్ట్​ స్టడీ ఒకటి తేల్చింది. దాదాపు 20 వేలమంది పేషెంట్లపై స్టడీ చేసి ఎలాంటి సైడ్​ఎఫెక్ట్స్ లేవని కన్ఫర్మ్​ చేసుకున్నట్లు వివరించింది. ఈమేరకు అమెరికాలోని మాయో క్లినిక్​ జర్నల్​ ఈ వివరాలను వెల్లడించింది. కరోనా బారిన పడి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా వైరస్​ ట్రీట్​మెంట్​లో ఉపయోగపడుతుందని డాక్టర్లు ప్రయోగాత్మకంగా నిర్ధారించుకున్నారు. దీంతో సీరియస్​ కండిషన్లో ఉన్న కరోనా బాధితులకు ప్లాస్మా ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు. ఈ ట్రీట్​మెంట్​ తర్వాత బాధితులు కోలుకుంటున్నారు కూడా.. అయితే, ప్లాస్మా ట్రీట్​మెంట్​ ఎంత వరకు సేఫ్​ అంటూ చాలామంది డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మాయో క్లినిక్​ దీనిపై స్టడీ చేపట్టింది. ప్లాస్మా ట్రీట్​మెంట్​ తీసుకున్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ఏప్రిల్​ 3 నుంచి జూన్​11 వరకు హాస్పిటల్​లో ప్లాస్మా ట్రీట్​మెంట్​ తీసుకున్న వారిని స్టడీ చేసింది. పేషెంట్లలో 40 శాతం మంది మహిళలు, 20 శాతం మంది ఆఫ్రికన్​ అమెరికన్లు, 35 శాతం మంది సెంట్రల్, సౌత్​ అమెరికన్లు కాగా 5 శాతం మంది ఆసియా దేశాల వారు ఉన్నారని పేర్కొంది. ట్రీట్​మెంట్​కు ముందు 12 శాతం ఉన్న మరణాల రేటు .. ఆ​తర్వాత 8.6 శాతానికి తగ్గిందని మాయో క్లినిక్​ ప్రిన్సిపల్​ ఇన్వెస్టిగేటర్​ మైఖెల్​ జాయ్​నర్​ చెప్పారు. వైరస్​ ప్రభావం కనిపించిన తొలినాళ్లతో పోలిస్తే ఇప్పుడు మెడికల్​ కేర్​ మెరుగుపడడం కూడా మరణాల రేటు తగ్గడానికి ఓ కారణమని అన్నారు.