కడప సెంట్రల్ జైలులో 19 మంది ఖైదీలకు కరోనా

కడప సెంట్రల్ జైలులో 19 మంది ఖైదీలకు కరోనా

కడప:  కడప కేంద్ర కారాగారంలో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పాజిటీవ్ వచ్చిన వారందరినీ చికిత్స కోసం ఫాతిమా కొవిడ్‌ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం సెంట్రల్ జైలులో ఖైదీల కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అనుమానితులు.. లక్షణాలున్న వారి నుండి స్వాబ్‌ నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించారు. 19 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఫలితాలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు కడప సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాలను కరోనా నివారణ ద్రావకంతో శుభ్రం చేయించారు. ఖైదీలందరూ సామాజిక దూరం పాటించాలని.. కరోనా నివారణ నిబంధనలు పాటించాలంటూ సూచనలు చేశారు. భయాందోళనలకు గురికాకుండా కౌన్సెలింగ్ నిర్వహించారు.