మెడికల్ కాలేజీలో 39 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

మెడికల్ కాలేజీలో 39 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

కరీంనగర్ లోని చల్మెడ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపింది. 39 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న 18 మందికి పాజిటివ్ రాగా, ఇవాళ మరో 21మందికి కరోనా వచ్చింది. మరికొంత మందికి టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ కేసులు పెరగడంతో కాలేజీకి సెలవు ప్రకటించింది యాజమాన్యం. అయితే మొత్తం ఎంతమందికి కరోనా వచ్చిందనే దానిపై రేపు ఉదయం క్లారిటీ వస్తుందన్నారు  జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ జువేరియా.