
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: చిట్యాల మండలం నవాబుపేట గ్రామానికి చెందిన పాసిగంటి మణెమ్మ(65) కు కరోనా పాజిటివ్ వచ్చింది. మణెమ్మ ఆమె భర్త మల్లయ్య ముంబైలోని తమ కుమారుడి వద్దకు వెళ్లి తిరిగి ఈ నెల 14న స్వగ్రామానికి చేరుకున్నారు. వెంటనే వారిని అధికారులు హోంక్వారంటైన్లో ఉంచారు. ఈక్రమంలో వృద్ధ దంపతులిద్దరికి ఎంజీఎంలో పరీక్షలు నిర్వహించగా మల్లయ్యకు పాజిటివ్ వచ్చింది. అనంతరం మణెమ్మకు పరీక్షలు నిర్వహించగా శనివారం రాత్రి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్రావు తెలిపారు. వారిద్దరినీ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు.