మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..హోం ఐసోలేషన్ లో ఉన్నానన్నారు. కొన్ని రోజులు తనకు ఫోన్ చేయడానికి, కలవడానికి ప్రయత్నించవద్దని సూచించారు. మళ్లీ కరోనా నుంచి కోలుకుని యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. ఇటీవల తనతో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరూ టెస్టులు చేయించుకోవాలని కోరారు.
జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో POK మహిళ పోటీ
#RTPCR పరీక్షల్లో నాకు #COVID పాజిటివ్ అని తేలింది.దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నాతో కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవాలని మనవి. హోం ఐసోలాషన్ లో ఉన్నాను. ఆందోళన చెందాల్సిన పని లేదు. మళ్ళీ యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను.
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) December 15, 2020