అయోధ్య రామ మందిరం పూజారికి కరోనా

అయోధ్య రామ మందిరం పూజారికి కరోనా

ఆగస్టు 5వ తేదీన అయోధ్యలోని రామజన్మభూమిలో రామ మందిర నిర్మాణాకికి భూమి పూజ జరగనుంది. అయితే పూజ నిర్వహించనున్న రామ మందిరం పూజారి ప్రదీప్ దాస్ కరోనా బారినపడ్డారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అంతేకాదు.. రామ జన్మభూమి దగ్గర భద్రతా విధుల్లో ఉన్న 16 మంది పోలీసులకు కూడా కరోనా సోకింది. దీంతో వారు క్వారంటైన్ లోకి వెళ్లారు. ఆగస్టు 5న రామ మందిరానికి భూమి పూజ జరగనుండగా, ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ సమయంలోనే పూజారికే కరోనా సోకడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది వరకు వీఐపీలు రానున్నట్టు తెలుస్తోంది. పూజారికి కరోనా సోకడంతో ఏం చేయాలనే దానిపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు.