
అదే వార్డులో మరో పది మంది బాలింతలకు ట్రీట్మెంట్
చాంద్రాయణ గుట్ట, వెలుగు: హైదరాబాద్ లోని హఫీజ్ బాబానగర్ కు చెందిన ఓమహిళ ఈ నెల 8న పాతబస్తీలోని బేలా సూరజ్భాన్ హాస్పిటల్లో చేరింది. తర్వాతి రోజే డాక్టర్లు సిజేరియన్ చేయగా బాబు పుట్టాడు. అయితే నాలుగు రోజుల కింద ఆమెకు దగ్గు,జలుబు మొదలైంది. డాక్టర్లు ఆమెను వేరే రూముకు షిఫ్టు చేసి శాంపిల్స్ సేకరించి కరోనా టెస్టులకు పంపారు. సోమవారం రిజల్ట్ లో వైరస్ పాజిటివ్ వచ్చింది. దాంతో గాంధీ హాస్పిటల్ కు పంపాలని డాక్టర్లు ఆమె భర్త, కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ డాక్టర్లు తప్పుగా చెప్తున్నారంటూ వాళ్లంతా గొడవకు దిగారు. దీనిపై హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వచ్చేలోపేకుటుంబ సభ్యులు ఆ బాలింతను, బాబును తీసుకుని వెళ్లి పోయారు. పోలీసులు వాళ్లను వెతికే పనిలో పడ్డారు. అయితే ఆ మహిళకు ట్రీట్మెంట్ చేసిన ఐదుగురు డాక్టర్లు, ఐదుగురు నర్సు ల్లో ఆందోళన మొదలైంది. వారందరి నుంచి సోమవారం శాంపిల్స్ సేకరించారు. ఇక ఈ మహిళకు ట్రీట్మెంట్ చేసిన వార్డులోనే మరో పది మంది బాలింతలు కూడా ఉన్నట్టు సమాచారం.