దేశంలో 70 లక్షలు దాటిన కరోనా రికవరీ కేసులు

దేశంలో 70 లక్షలు దాటిన కరోనా రికవరీ కేసులు

దేశంలో కరోనా కేసులు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా 50 వేల కేసులు నమోదవుతుండగా.. రికవరీ కేసుల సంఖ్య 70 లక్షల మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో 50,129 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 578 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మొత్తం 78,64,811 కు చేరగా..మృతుల సంఖ్య1,18,534కు చేరింది. నిన్న ఒక్కరోజే 62,077 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ కేసుల సంఖ్య 70,78,123కు చేరింది. నిన్న ఒక్కరోజే 11,40,905 మందికి టెస్టులు చేయడంతో దేశంలో అక్టోబర్ 25 నాటికి కరోనా టెస్టుల సంఖ్య మొత్తం 10 కోట్ల 25 లక్షల 23 వేల 469కు చేరింది.

For More News..

అనారోగ్యంతో శామ్‌సంగ్ ఛైర్మన్ మృతి

తెలంగాణలో మరో 978 కరోనా కేసులు

బెంగళూరు వరద బాధితులకు 25 వేల సాయం